మాండలిక నవల

September 13, 2011 at 3:30 am Leave a comment

http://www.uohyd.ernet.in/index.php/admissions

Ph.D-(Telugu)-2010

View this document on Scribd

April 18, 2011 at 8:15 am Leave a comment

university of hyderabad admission notification

university of hyderabad admission notification

April 18, 2011 at 7:34 am Leave a comment

ఈ పదేళ్ళ కవిత్వం పట్టుకున్నదేమిటి?


Courtesy : సూర్య పత్రిక ‘‘ అక్షరం” 11-4-2011

 

సరదాగోనో, సీరియస్‌గానో పదేళ్ళ కవిత్వాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది? లేదా పదేళ్ళ నుండి కవులు ఎలాంటి కవిత్వాన్ని రాస్తున్నారు? లేదా పదేళ్ళలో పత్రికలు, ఇంటర్నెట్‌ పత్రికలు ఎలాంటి కవిత్వానికి ప్రాధాన్యాన్నిస్తున్నాయి? పోనీ, పత్రికలకేమాత్రం సంబంధం లేకుండా కవులే స్వయంగా ప్రచురించుకున్న పుస్తకాల్లోనో, స్వేచ్చగా రాసుకోగలిగే అవకాశం ఉన్న బ్లాగుల్లోనో ఎలాంటి కవిత్వం కనిపిస్తుంది? మొదలైన ప్రశ్నలకు అందరికీ సంతృప్తికరమైన సమాధానాన్నివ్వలేకపోయినా, అలాంటి ప్రయత్నంతో వెలువడిన ఒక కవితాసంకలనాన్ని చూపించవచ్చు.దీని పేరు ‘‘అనేక’’ సుమారు 2000 నుండి 2009 వరకూ తెలుగులో వచ్చిన వచన కవితల్లో 182 కవితల్ని అఫ్సర్‌, వంశీకృష్ణ సంపాదకత్వంలో ‘‘అనేక’’ పేరుతో సారంగపబ్లికేషన్స్‌ వారు ప్రచురించారు. విలువైన విషయాల్ని ప్రస్తావిస్తూ సంపాదకీయం రాసినా, కొన్ని అంశాల్ని స్పర్శించలేకపోయారు. పైగా సేకరించిన కవితల్లోని అంశాల కంటే ఇతర అంశాల్ని ఎక్కువగా ప్రస్తావించినట్లుంది.
దండోరా నుండి గ్లోబలైజేషన్‌ దాకా, ముస్లిం సాంస్కృతికత నుండి ‘‘గుజరాత్‌ గాయం’’ దాకా వచ్చిన కవిత్వ సంకలనాల నుండి కవితల్ని తీసుకున్నా, ఆ యా కాలాల్లో వచ్చిన ఉద్యమాన్ని ప్రాతినిథ్యం వహించగలిగే కవితల్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఈ పదేళ్ళ కాలంలో వచ్చిన ఉద్యమాలకి సరైన ప్రాతినిథ్యం ఇచ్చినట్లనిపించట్లేదు. ఆ ఉద్యమాల ప్రస్తావన చేసినా ఆ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గని కవిత్వం రాసేవారి కవితల్ని ఎంపికచేయకుండా దీన్ని ‘‘ఒక ముద్రవేసిన తరువాత ఆ కవిని ఆ ముద్రలోంచి చూసి అతని కవిత్వ సారాన్ని, స్థానాన్ని అంచనా వేయడం అందరూ చేస్తారు. కనుక, అటువంటి పనిచేయడం లేదని’’ చెప్పుకుంటూ, మరో కవితని వేయడం కవి లక్ష్యాన్ని, ఆ కాలంలో ఆ ఉద్యమం పట్ల కవి ఆశించిన దాన్ని నీరు కార్చేప్రయత్నం చేసినట్లవుతుంది. ఉదాహరణకు ఎండ్లూరి సుధాకర్‌, కృపాకర్‌మాదిగ, దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి వంటి వాళ్ళు దండోరా గురించి బలమైన కవిత్వాన్ని రాస్తే, దాన్ని విస్మరించి, వాళ్ళు ఒకానొక సందర్భంలో రాసిన కవితల్ని ప్రచురించారు. అమ్మాయిలపై పెరుగుతున్న యాసిడ్‌ దాడుల గురించి ఎండ్లూరి సుధాకర్‌ రాసిన ‘‘దు:ఖగంధకామ్లవర్షం’’, కృపాకర్‌ సెజ్‌ లను వ్యతిరేకిస్తూ ‘‘ప్రత్యేక చావుమండళ్ళు’’ అంటూ రాసిన కవితను, ఎజ్రాశాస్త్రి ‘‘మా ఊరికో శ్మశానం కావాలి’’ అని ప్రపంచీకరణ ప్రభావాన్ని పట్టిచూపే కవితల్నీ ఎంపిక చేశారు. ఎండ్లూరి దళితగోవిందం, ఖైర్లాంజీ సంఘటనలపైనా, ఇంకా రకరకాలుగా దళిత, మాదిగ జీవితాన్ని పండిరచిన కవితలెన్నో రాశారు. అలాగే మిగాతా వాళ్ళు కూడా రాసినా,వాటిని పట్టించుకోకుండా, మాదిగ జీవితానికే మాత్రం సంబంధం లేని కవి సీతారాం రాసిన ‘కుప్పం కాబ్లర్‌’’ కవిత తీసుకున్నారు.
‘‘ఈ చెట్టు కిందే /
మాతాత గూటం పాడతాడు /
దీనిలోనే మా అయ్య నడిచాడు /
నేనూ ఇక్కడే పాతుకుపోయాను పాతికేళ్ళుగా…/
ఇలా కొనసాగిన కవితలో ‘‘ ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడు నాకు /
నన్ను గమనించే వాడంటే నాకు పడదు…/
పాడెకడతానంటాను వాడి కవిత్వానికి నేను’’ వంటి కవిత్వాన్ని ఎంపికచేశారు.
అలాగే ఒక ముస్లిం దేశభక్తినీ, స్త్రీవేదననీ వ్యక్తీకరించిన ముస్లిం రచయితల కవితల కంటే కొండేపూడి నిర్మల రాసిన
‘‘ దేశద్రోహికన్నీటి చుక్క’’ ను ప్రచురించారు. దీనిలో చూడండి
‘‘ఆస్తితో సహా ఆడదాన్ని ఏలుకోవడానికి /
కీర్తివంతులయిన నా అత్తింటి వారెవరో ముందుకొస్తారు /
బహుశా మరికొన్నిసార్లు వితంతువునవడానికి నేను /
పులకించిపోవాలి /
నిఖా సంబరాలు వెలిసిపోకుండానే /
ఫాతెహాలకు దర్బారు తీరిన మన జీవితాల్లో /
దేనికి మాత్రం అర్థసందర్భాలున్నా’’ యని ముస్లిం స్త్రీవేదనను పలికించారు. వీటి కంటే మరింతబలంగా తమ సమస్యల్ని మూలాల్లోకి వెళ్ళి, భాషతో సహా షాజహానా మరికొంతమంది ఇంతకంటే బలమైన కవిత్వాన్ని రాయలేదా? దీన్ని బట్టి కేవలం కవిత్వానికిచ్చిన ప్రాధాన్యం, ఆ అస్తిత్వం కోసం కవిత్వం రాసిన వారికివ్వలేదనిపిస్తుంది. దీన్నిబట్టి అస్తిత్వ ఉద్యమాల్ని గుర్తిస్తున్నట్లా? ఆ ఉద్యమాల పరిధి విస్తరించాలని భావిస్తున్నట్లా? స్త్రీవాదంలోని దళిత స్త్రీవాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బలంగా అభివ్యక్తీకరించిన జూపాక సుభద్ర కవితల్ని వదిలేసి మరో కవితని ప్రచురించారు. ప్రాంతీయవాదాన్ని బలంగా వ్యక్తీకరించే కవితలు అనేకం ఉండగా వాటినీ పట్టించుకోకపోయినా, తెలంగాణ కవుల్నీ, కవిత్వాన్నీ మాత్రం అధికశాతంగానే రికార్డ్‌ చేయగలిగారు. అలాగే, కొద్దోగొప్పో ముస్లిం, క్రైస్తవ కవిత్వాన్ని రిప్రజెంట్‌ చేసే కొన్ని కవితలకు చోటు లభించినా,అందులోనూ బలమైన కవితల్ని తీసుకోలేదు.
ఎంపిక చేసిన వారికి స్వేచ్చ ఎంత ఉన్నా, అన్నింటికీ ఆర్థిక కోణమే ప్రధానమనే రీతిలో సంపాదకీయం కొనసాగించినా, కవిత్వం పేరుతో సౌందర్యానుభూతికే అధికప్రాముఖ్యాన్నిస్తూనే, ఆర్థిక సంఘర్షణలే నిర్దిష్టవాదాలు బయలుదేరడానికీ, బలం పుంజుకోవడానికీ కారణభూతమైయ్యాయని, అందువల్ల ప్రపంచీకరణ నీడలోనే పదేళ్ళ కవిత్వం నడిచిందనే సూత్రీకరణ చేసేప్రయత్నం చేశారు. నిజానికిది ప్రపంచాన్నీ, ఆంధ్రప్రదేశ్‌నీ అమెరికా ఆర్థిక నయనాలతో చూడ్డమే తప్ప, అన్ని అస్తిత్వ ఉద్యమాలకీ ఆర్థికమే కారణమనడం సరికాదు.కమ్యూనిష్టులు ప్రతిదాన్నీ ప్రపంచీకరణతో ముడిపెట్టి దాన్ని వ్యతిరేకించడం ఒక ఫ్యాషన్‌గా మార్చుకున్నట్లు, దేశీయవాస్తవికతను విస్మరించి కులాన్నీ, ప్రాంతీయతనీ దానిలోనే ఇరికించాలనుకునే ప్రగతిశీల గతస్మృతుల్నీ, అనుబంధాల్నీ వీడలేని సాహితీవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే దీన్నీ భావించాలి.
ఈ దేశంలో ఏదో ఒకకులంలో పుట్టినా, పైకి కులం బాధ కనిపించనట్లుంటూనే, వాళ్ళు ఒక రాజకీయశక్తిగా ఎదగలేకపోవడానికి, ఆర్థికశక ి్తలేకపోయినా, సాంఘికంగా కులం వల్ల లభించిన అవకాశాల కారణంగా వైయక్తికంగానూ, వ్యవస్థీకృతంగానూ ముందుకి వెళ్ళడానికి కూడా కేవలం ఆర్థికపరమైన అంశాలే కారణమని భావించాలా?అయితే, ఈ పదేళ్ళలో వెనుకబడినతరగతుల నుండి నాయకత్వాన్ని వహించగలవాళ్ళు ఉన్నా, పెట్టిన పార్టీల్ని మళ్ళీ అగ్రవర్ణఆధిపత్యంలో నడుస్తున్న పార్టీల్లోనే విలీనం చేయడం వెనుక కులం కారణమా? ఆర్థిక పరిస్థితులు కారణమా? అనేది ఆలోచించాలి.


ఈ పదేళ్ళలో అటుసామాజికంగాను,రాజకీయంగాను దళితులు, వెనుకబడిన తరగతులు ముందుకొస్తున్నట్లే కవిత్వంలోను తమదైన బలమైన ముద్రను వేయడమే కాకుండా, పదిహేనువందల యేండ్లపాటు ఆధిపత్యాన్ని వహించిన కవిత్వానికి అర్థశతాబ్దంలోనే వణుకుపుట్టించగలిగారు. ‘‘వెనుకబడిన తరగతులు’’గా సాధించలేని అభివృద్ధిని ‘‘వెనుకబడిన కులాలు’’గా గుర్తింపజేసుకోవడం ద్వారా సాధించవచ్చని ఉద్యమాలు మొదలైయ్యాయి. తమ నిజమైన శత్రువుని గుర్తించడంలో కొంచెం అటూ ఇటైనా ఈపదేళ్ళలో వెనుకబడిన కులాల వాళ్ళు తమ జీవితానుభవాల నుండి ‘‘వెంటాడే కలాలు’’ పేరుతో 2001లో ఒక కవితా సంపుటిగా బయటకొచ్చారు. దీనిలోనూ ఆర్థికాంశాలున్నా, వాటికంటే కుల చైతన్యమే ప్రధానంగా కనిపిస్తుంది. వీళ్ళని వృత్తుల వాళ్ళగానే కాకుండా కులవృత్తుల వాళ్ళుగా పరిగణించడం వల్ల వాళ్ళ నిజమైన అస్తిత్వాన్ని గుర్తించినట్లవుతుంది.కానీ, శ్రామికుల చట్రంలోనే కట్టేయడం వల్ల వెనుకబడిన కులాల వాళ్ళకి తీరని అన్యాయమే జరిగిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటు, ఉద్యమాలతో ముందుకొస్తున్నారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు కవిత్వాన్ని నిలదీసిన దండోరా కవిత్వాన్ని జల్లెడపట్టి ఉత్తమకవిత్వాన్ని ఒకచోటకు చేర్చిన కవితాసంకలనం ‘‘కైతునకలదండెం’’ (2008). ఈ దేశంలో కులం, మతం తమనెలా పీల్చిపిప్పిచేశాయో కులాన్ని ఆశ్రయించుకున్న ఆర్థిక, రాజకీయ,సాంస్కృతికాంశాల్ని రికార్డ్‌ చేసిన కవితా సంకలనమిది. ఇలాగే మతం తమనెలా హింసించిందో వ్యక్తిగతంగాను, సంకలనాల రూపంలోను ఈ పదేళ్ళలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీకవిత్వానికి సంబంధించినవి వచ్చాయి. వీటినీ ఆర్థికపునాది మింగేసిందన్నట్లే చూపారు. కుల, మత పీడనను బలంగా చెప్పిన కవితలు దీనిలో తీసుకోలేదు. సంకలనంలో ఉన్నవాటి గురించి మాట్లాడాలంటే ఈ పదేళ్ళలో వెలువడిన ‘‘కవిత్వాన్ని’’ పట్టకోగలిగినా, కవుల ఆత్మల్ని పట్టించుకోలేదు. కవుల ఆశయాల్ని, లక్ష్యాల్ని గుర్తించాల్సిన కవితల్ని విస్మరించి కవుల్ని మాత్రం గుర్తించారు.పైకి ప్రపంచీకరణ ప్రభావమనే వ్యవస్థీకృత చైతన్యంగా కనిపించినా, వాళ్ళ జీవితలోతుల్ని తాకని కవిత్వాన్ని స్వీకరించి, ఆ వ్యక్తుల్ని గుర్తించి, పరోక్షంగా వైయక్తికతకు పీఠం వేశారు.
పుస్తకంలో ఎంపిక చేసిన కవితల్ని వివిధ విభాగాలుగా చేసి, ఆ విభాగానికి ఒక్కో పేరు పెట్టడంలో నూతనత్వం కనిపిస్తున్నా, కేవలం అవి ఆ వర్గంలోకి మాత్రమే వచ్చే కవితలని స్పష్టంగా చెప్పలేనివీ అనేకం అందులో ఉన్నాయి.అక్షరం, అనుభవం, అస్తిత్వం, అలజడి, ఆందోళన, అతడు`ఆమె, ఆవలితీరం, అనంతరం అని ‘‘అ,ఆ’’లతో ఒక క్రియేటివిటీని ప్రదర్శించడం చాలా మందికి అది ఒక చమత్కారమనిపించినంతగా, అందులోని సీరియెస్‌నెస్‌ గుర్తించకపోచ్చు.
కవిత్వ చరిత్ర మాత్రమే తెలుగు సాహిత్య చరిత్రగా వక్రీకరించడం సరైంది కాదని మన సాహిత్య చరిత్రకారుల్ని తప్పుపట్టిన విమర్శకులకు, మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వకుండా మాత్రం జాగ్రత్త పడుతూనే ఈ సంకలనాన్నితీసుకొచ్చారు. సుమారు తొమ్మిది వందల సంవత్సరాలుగా అవిచ్చిన ప్రవాహమైన పద్యకవిత్వాన్ని భావకవిత్వం బద్దలు కొడితే, భావకవిత్వంలోని స్వేచ్ఛాప్రియత్వం పేరుతో సమాజాన్ని పట్టించుకోనికవుల్ని అభ్యుదయకవిత్వం గాడిలో పెట్టింది. రాయడం వరకే పరిమితమైపోతే కుదరదని, దాన్ని ఆచరణలోనూ చూపాలని విప్లవకవిత్వం కవుల్ని మరింత హెచ్చరిస్తే, ఆచరణలోని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ స్త్రీ, దళిత,బహుజన, ప్రాంతీయ, ముస్లిం, క్రైస్తవ మైనారిటీ కవిత్వ ఉద్యమాలు ముందుకొచ్చిన తర్వాత చాలామంది కలాలు మూతపడ్దాయి. దానితో అంతకు ముందు రాసిన వాటితోనే తమకి దక్కిన ‘‘కవి’’ గౌరవ మర్యాదల్ని కొనసాగించుకుంటూ పోతున్నవాళ్ళెంతో మంది ఉన్నారు. ఆధునికంలో ఉంటూనే, ‘‘గతకాలము మేలు, వచ్చు కాలముకంటే’’ అని పైకి అనకపోయినా, గతంలో రాసిన కవిత్వాన్నే నెమరువేసుకుంటూ మాత్రం బతికేస్తున్నవాళ్ళున్నారు. ఇలాంటప్పుడు నొప్పించక, తానొవ్వక ‘‘మానవతావాదం’’ పేరుతో సమకాలీనతను ఏమాత్రం పట్టించుకోకుండా కేలండర్‌ కవిత్వాన్ని రాస్తూ, ప్రభుత్వకవులుగా బతికేస్తున్న వాళ్ళూ ఉన్నారు. ఇలాంటిస్థితి పట్ల ఈ పదేళ్ళ కవిత్వాన్ని గమనిస్తున్న కవి ఇలా అంటున్నాడు.
‘‘బాధలేదని కాదులే!/
కాకపోతే, ఎవరిబాధో తప్ప/
రాయలేనితనం / …..
సొంతమూ, పరాయీ అని కాదు కాని/
నువ్వు నీదేహంలో సంచరించడం మానేసి /
ఎంతకాలం అయ్యింది, చెప్పకూడదూ,కాస్త ’’ (అఫ్సర్‌) అనడంలో నిత్యం రాయాల్సిన కవులు ఎందుకు రాయడంలేదో తెలుసుకోవాలనే తహతహ కనిపిస్తుంది. కవులు, సాహితీవేత్తలు అందరి ఓట్లు తమకి దక్కుతాయో లేదో, ఏదోలా దక్కించుకోవాలనుకొనే చాలా మంది రాజకీయవేత్తల్లా ప్రవర్తించకూడదనే ఆవేదన చాలామందికి ఉందని ఈ కవితా ఖండికచెప్తుంది. కానీ, దీనిలో నిజంగా అలా స్పందించిన వారి కవిత్వమేది? పదేళ్ళ కవిత్వాన్ని ఓ చోటుకి తీసుకుని రావాలనే ప్రయత్నం మంచిదే కాని, పదేళ్ళనే కాలంలో జరిగిన సంఘటనల్ని సరైన రీతిలో గుర్తిస్తే మరింత బాగుండేది.
(అనేక ` పదేళ్ళ కవిత్వం) కవితా సంకలనం, సంపాదకులు : అఫ్సర్‌, వంశీకృష్ణ, సారంగబుక్స్‌ ప్రచురణ, వెల. రూ.199లు. పుటలు: 400 ప్రతుల కోసం సంప్రదించాల్సిన చిరునామా: పాలపిట్టబుక్స్‌, లేదా ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు)
-డా॥దార్ల వెంకటేశ్వరరావు
9989628049
(సూర్య పత్రిక ‘‘ అక్షరం’’ 11-4-2011)

April 11, 2011 at 8:58 am Leave a comment

“సత్యం” మీద ప్రమాణం చేసి…నిజమే చెప్పాలి…

కులమెత్తి తిట్టే సుజనుల గడ్డమీద
మలమెత్తినోళ్ళ సంతతి నుదుటిమీద
మరణశాసనాలే  లిఖిస్తున్నప్పుడు..
దళితవాడ  బతుకు
కారంచేడు మహిళామండలి  మేడంత
అందంగా వుండదురా బాబూ !

కామాంధుల కథలో
కూటికుండల వీధిదొంగను తెచ్చి
కాటికి వకాలతునామా రాసినప్పుడే తెలుసు
ఈ సత్యోద్యుల మధ్య

సత్యాభి సంధుల మధ్య
ఈ ‘సత్యం’ బతికి బట్ట కట్టడం మిధ్యనీ ..

‘సత్యమేవ జయతే’
ఒకే భూగ్రహం కింద
ఒకే జాతీయ జెండా కింద
ఎన్ని సత్యోపదేశా
లెన్ని సమైక్యగీతా
లెన్ని ప్రభోధగీతా

లెన్ని జాతీయగానా
లెన్నెన్ని పంగనామాలు …

ఆకలిని
జాతీయగానంగా మార్చుకున్నచోట
ఈకలకోసమే పెంచే నిప్పుకోళ్ళకథ విన్నావా !
ఆకలికేకల పాప్ సంగీతంలో
సెగబారిన  రెక్కలడొక్కలమీద
చిర్ర చిటికెన పుల్లతో తాటిస్తే
ఐక్యరాజ్య సమితి కర్ణభేరి పగిలి
‘ఆలివర్ ట్విస్ట్’ కథ కర్ణపిశాచై వెంటబడదా !
నర్తిస్తున్న నల్లకోటుల వక్తృత్వంలో

చెలగువేస్తున్న దేవనాగరి రాక్షస సంగీతంలో
రాసలీలల భువనవిజయం కలవాళ్ళదే కదా !
చెప్పండి మిలార్డ్ !
ఈ సత్యాసత్యాల విచికిత్సలో
ఒక బలహీనుడి వెన్నెపూసని
బలంగా తుంచి పారెయ్యమని
ఏ పౌరనీతి శాస్త్రం భోదించిందో
ఏ భారతీయ శిక్షాస్మృతి ఆదేశించిందో
“సత్యం ”  మీద ప్రమాణం చేసి
ఈ ఒక్క నిజమైనా  చెప్పాలి
అబద్దం చెప్పకూడదు..

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
డైరెక్టర్, ఇండియా టూరిజం, భారత ప్రభుత్వం, పశ్చిమాసియా & ఆఫ్రికా
wilsonsudhakar@hotmail.com

December 14, 2010 at 12:07 pm 1 comment

జాతీయ సదస్సు లో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు!

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎమిరిటస్ ప్రొపెసర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు జాతీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఆ దృశ్యాలలో కొన్నింటిని ఇక్కడ ఇలా…

జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
స్వాగతం పలికి అతిథులను పరిచయం చేస్తున్న ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు
సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు

కీలకోపన్యాసం చేస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు మాట్లాడుతుంటే ఆలకిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగాన్ని వింటున్న డా. కొలకలూరి మధుజ్యోతి తదితరులు

ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన కీలకోపన్యాసం గురించి ఆచార్య ఇనాక్ గారితో చర్చిస్తున్న అధ్యాపక బృందం
ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి అమ్మాయిలు డా ఆశాజ్యోతి, డా.మధుజ్యోతి గార్లతో డా. దార్ల , మంజుశ్రీ
ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి అమ్మాయిలతో డా ఆశాజ్యోతి, డా.మధుజ్యోతి గార్లు
ప్రారంభోపన్యాసం చేస్తున్న ఆచార్య మోహన్ జి. రమణన్ గారు
వందన సమర్పణ చేస్తున్న డా.పిల్లలమర్రి రాములు గారు

September 27, 2009 at 12:54 pm Leave a comment

జాతీయ సదస్సులోని కొన్ని ఫోటోలు : ఎండ్లూరి సుధాకర్ గారివి!

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఈ సదస్సులో పాల్గొని రుబాయిత్, గజల్ ప్రక్రియల గురించి పత్రాన్ని సమర్పించారు. ఒక సదస్సుకి అధ్యక్షత వహించారు. వాటిలో కొన్ని ఫోటోలు. 

తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. వేదిక పై ( ఎడమ వైపు నుండి) జె. రమేశ్ , డా. బాల శ్రీనివాసమూర్తి, డా. పిల్లలమర్రి రాములు, గుడిపాటి, భట్టు సుధాకర్
సదస్సులో పాల్గొన్న తర్వాత టీ విరామసమయంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
సదస్సులో పాల్గొన్న ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డా. రాములు, ఆచార్య తుమ్మలరామకృష్ణ తదితరులు
టీ సేవిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు సమావేశంలో పాల్గొన్న ప్రే క్షకులు

విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి గారితో మాట్లాడుతున్న డా. జె.భీమయ్యగారు
వేదికపైకి వెళ్ళేముందు తనకెంతో ఇష్టమైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ఆచార్య ఎండ్లూరి గారు ఆనందంగామాట్లాడుతూ…
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న డా. కనకయ్య, డా. దార్ల
సభలో ప్రసంగించే ముందు
ఆచార్య ఎండ్లూరి అధ్యక్షతన డా. అద్దేపల్లి రామమోహన రావు గారు పత్ర సమర్పణ చేశారు
సాహిత్య అకాడమీ సలహాసభ్యులు ఆచార్య జి. ఉమామహేశ్వరరావు గారు తదితరులు


సభలో జనం
సభలో జనం
ఆచార్య జి. ఉమామహేశ్వరరావు , ఆచార్యఎండ్లూరి సుధాకర్ తదితరులు

జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు

జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు

September 27, 2009 at 6:52 am Leave a comment

”వీచిక” ఆవిష్కరణ ఫోటోలు!

’వీచిక’ ఆవిష్కరణ ఫోటోలు!


వీచిక ఆవిష్కరణకు విచ్చేసిన సాహితీ వేత్తలకు స్వాగతం పలుకుతున్న రచయిత డా. దార్ల వెంకటేశ్వరరావు

సభలో అతిథులకు స్వాగతం పలుకుతున్న డా. అద్దంకి శ్రీనివాస్

వీచిక ఆవిష్కరణ కు ముందు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న దృశ్యం
వీచిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు. సభలో పాల్గొన్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య మోహన్ జి.రమణన్ , డా.ద్వానాశాస్త్రి, రచయిత డా.దార్లవెంకటేశ్వరరావు తదితరులు

వీచిక ఆవిష్కరణ అనంతరం ఆచార్య పరిమి రామనరసింహం దంపతులకు పుస్తకాన్ని అంకితం చేస్తున్న దృశ్యం
డా. ద్వానాశాస్త్రి గారు తన శిష్యుడు డా.దార్ల వెంకటేశ్వరరావుని సన్మానిస్తున్న దృశ్యం
వీచిక ఆవిష్కరణకు విచ్చేసిన ఆచార్య ఉమామహేశ్వరరావు, డా.బి. రాజశేఖర్, ఆచార్య ముజఫర్ ఆలీ తదితరులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన తెలుగు శాఖ అధ్యాపకులు డా. రేమెళ్ళ రామ కృష్ణ శాస్త్రి, డా. పిల్లలమర్రి రాములు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. అద్దంకి శ్రీనివాస్ తదితరులు
వీచిక పుస్తకాన్ని సమీక్షిస్తున్న ఆచార్య జి. అరుణకుమారి గారు
వీచిక పుస్తకాన్ని సమీక్షిస్తున్న ఆచార్య జి. అరుణకుమారి గారు
సభలో పాల్గొన్న ప్రేక్షకులు
అంకితం స్వీకరించిన తర్వాత రచయిత దంపతులను అభినందన సత్కారం చేస్తున్న ఆచార్య పరిమి రామనరసింహం దంపతులు

వీచిక అంకితం స్వీకరించిన తర్వాత తన స్పందనను వ్యక్తీకరిస్తున్న ఆచార్య పరిమి రామనరసింహం గారు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు

వీచిక ఆవిష్కరణ సభలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభలో పాల్గొన్న హైదరాబాదువిశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య మోహన్ జీ రమణన్ కి తొలి ప్రతి అందిస్తున్న రచయిత డా.దార్ల వెంకటేశ్వరరావు
వీచిక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఫిలాసఫీ డిపార్ట్ మెంట్ హెడ్ ఆచార్య రఘురామరాజు తదితరులు

వీచిక ఆవిష్కరణ సభలో పాల్గొన్న హైదరాబాదువిశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య మోహన్ జీ రమణన్ కి తొలి ప్రతి అందిస్తున్న రచయిత డా.దార్ల వెంకటేశ్వరరావు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ అనంతరం ఆచార్య పరిమి రామనరసింహం దంపతులకు పుస్తకాన్ని అంకితం చేస్తున్న దృశ్యం


వీచిక ఆవిష్కరణ అనంతరం ఆచార్య పరిమి రామనరసింహం దంపతులకు పుస్తకాన్ని అంకితం చేస్తున్న దృశ్యం

August 22, 2009 at 3:01 pm Leave a comment

నాన్న సమాధి ఫోటోలు

నాన్న సమాధి ఫోటోలు

#fullpost{display:none;}

నాన్నగారి గురించి ఇలాంటి టపా రాయవలసి వస్తుందని ఊహించలేకపోయాను. ప్రతి జీవికీ తల్లి, తండ్రీ ఎంతో ముఖ్యం. వాళ్ళున్నంత వరకూ ఏదో గొప్ప ధైర్యం ఉంటుంది. వాళ్ళలో ఎవరు దూరమైపోయినా ఆ బాధ వర్ణనాతీతం. నాకైతే నాన్న ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనిపిస్తుంది. మళ్ళీ ఊరికెళ్ళినప్పుడు ఎదురొస్తాడనిపిస్తుంది. మా చెల్లి పిల్లల్లో ఒకడు ఇలా అడిగాడు” మావయ్యా… సమాధి నుండి జీసెస్ మళ్ళీ బయటకొచ్చారటకదా… తాతయ్య కూడా వచ్చేస్తారు కదా” వాడికేమని చెప్పాలి? మనిషి మరణం తప్పదని తెలిసి కూడా ఎందుకిలా ఇన్ని రకాలైన అనుబంధాల్ని పెంచుకుంటుంటాం? ఏది ఏమైనా నాన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి పోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజంగా మళ్ళీ నాన్నని చూడగలుగుతానా? నిజంగా స్వర్గ,నరకాలున్నాయా? పోనీ బైబిల్ ప్రకారమే చూసినా నిజంగా సమాధి నుండి మళ్ళీ మానవులు లేవబడతారా?

నాన్న గారికి కుటుంబ సభ్యులు, ప్రజల్లు నివాళి సమర్పించారు.

మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో ఏప్రిల్ 9 వతేదీన మానాన్న గారి జ్ఞాపకార్ధ కూటమి జరిగింది. ఈ సందర్భంగా నలుగురు ఫాస్టర్స్ జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్నారు. బైబిల్ వాక్యాన్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు.

జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
బైబిల్ వాక్యాన్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు.

భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.


ప్రజలు, కుటుంబసభ్యులు ఈస్టరు రోజున నివాళులు అర్పించి ప్రార్థనలు చేశారు.
సమాధి దగ్గర ఈస్టరు రోజునఫాస్టరు గారు బైబిల్ వాక్యాన్ని చదివి వినిపించారు.
ఈస్టరు రోజున పువ్వులతో, కొవ్వొత్తులతో అగరుబత్తీలతో నిండిపోయిన నాన్న సమాధి.

April 16, 2009 at 12:27 pm 1 comment

మైనారిటీ సాహిత్యం-మరో చూపు

(ఈరోజు (16-3-2009) ఆంధ్రప్రభ సాహిత్యానుబంధంలో మైనారిటీ సాహిత్యం-మరో చూపు పేరుతో ఈ కింది వ్యాసం ప్రచురితమైంది. )

డా// దార్ల వెంకటేశ్వర రావు తెలుగు లెక్చరర్,

కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు,

గచ్చిబౌలి, హైదరాబాదు – 500046

vrdarla@gmail.com ఫోన్‌: 9989628046

ప్రపంచ వ్యాప్తంగా గానీ, భారత దేశంలో గానీ ముస్లిములు సంఖ్యాపరంగా మైనారిటీలు కాదు. భారతీయ జనాభా లెక్కల ప్రకారం చూసినా ముస్లిములు రెండవ స్థానంలో ఉన్నారు. అటువంటప్పుడు వీరిని మైనారిటీలని ఎలా పిలావాలి? అలా పిలవడం వెనుక ఉన్న కారణాలేంటి? అని ఆలోచించవలసి ఉంది. నా అభిప్రాయం ప్రకారం మైనారిటీ సాహిత్యం అంటే ముస్లిం సాహిత్యమే కాదు. క్రైస్తవ సాహిత్యం కూడా అవుతుంది. అయితే అది ఆ మతాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రజలపై జరుగుతున్న దాడులను, అభద్రతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ మతం వల్ల వారిపై జరుగుతున్న అల్పసంఖ్యాక భావమే వారి రచనల్లో వ్యక్తమైతే అప్పడు అది “మైనారిటీ సాహిత్యం” అవుతుంది. “దళితులు” అని చాలామందిని కలిపి పిలుస్తున్నా, వాస్తవంలో దళితులంటే మాల, మాదిగ తదితర ఉపకులాలవారనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఉమ్మడిగా దళితుల్లో తమకి రావలసిన హక్కులను తమకి రావాలని వాదిస్తూ మాదిగ తదితర ఉపకులాల వాళ్ళు ఉద్యమంతో పాటు, సాహిత్యాన్ని కూడా రాస్తున్నారు. కానీ, ముస్లిం మైనారిటీ సాహిత్యానికి లభిస్తున్న ప్రాధాన్యత, దళితుల్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యధలను వక్తీకరిస్తూ రాస్తుంటే, దానికి లభించడం లేదు. ఆ విధంగా మాదిగ సాహిత్యం ”మైనారిటీ తనాన్ని” సంతరించుకుంది. సామాజికంగానూ దళితులుగానూ వృత్తి చేతా, సహజీవనం చేయవలసిన వారి చేతా అవమానించబడుతూ, దాని గురించి రాస్తే ఏమవుతుందో అనే అంతటి అభద్రతతో అనేక మంది మాదిగ సాహితీ వేత్తలు ఆలోచిస్తున్నారు. వీరికి తగిన ప్రాధాన్యత లభించక పోగా, ఒకరిద్దరు ఎవరైనా సాహసించి తమ భావాల్ని రాస్తే, వారిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మాదిగ వాదాన్ని రాస్తునందుకు డా// ఎండ్లూరి సుధాకర్ పై అనేక మంది దాడి చేస్తున్నారు. కలం పేర్లతో, దొంగ పేర్లతో రాస్తూ సాహిత్య దాడులు చేస్తున్నారు. వ్యక్తి గతంగా కూడా నిందలు చేస్తున్నారు. డా// ఎండ్లూరి సుధాకర్ గారి వాదాన్ని సమర్ధిస్తూ రాసే వారి రచనలు ఎన్ని ప్రచురణకు నోచుకుంటున్నాయి? ఇదంతా మాదిగసాహిత్యం ”మైనారిటీ”కి గురికావడం కాదా? ఉమ్మడిగా దళితులుగా ఉండటం లేదా అలా పరిగణన పొందడం వల్ల మాదిగలకు జరుగుతున్న అన్యాయం కాదా? ఒరిస్సా,తమిళనాడు తదితర చోట్ల క్రైస్తవులపై, లేదా క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తున్న దళితులపై కొంతమంది దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని ఖండిస్తూ వెలువరించే ఎన్ని ప్రకటనలు న్యూస్ అవుతున్నాయి? అసలు ఆ దాడులు వెలుగులోకి రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇదంతా క్రైస్తవులుగా మారేటప్పుడు దళితులు మైనారిటీ తత్త్వానికి గురికావడం కాదా? ఆ విషయాలన్నీ రాస్తే , వాటిని ప్రచురించే సంస్థలెన్ని ఉన్నాయి? తమ సమస్యల్ని , తమ ఫీలింగ్స్‌ని రాయడానికే భయపడుతున్న స్థితిలో ఉండటం మైనారిటీ భావం కాదా? తెలుగులో ముస్లిములు తమ అభద్రతను రాస్తుంటే వెంటనే ప్రచురించడామే కాకుండా, వాటి పై అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలు కూడా చేయిస్తున్నాయి. ఈ స్థితి మాదిగ సాహిత్యానికి దక్కుతుందా? దళితుల్లోని మిగతా ఉప కులాల వారికి లభిస్తుందా? కనుక, మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే అని అనుకోవడం సరైంది కాదు. కానీ, సంఖ్యాపరంగా వాళ్ళు హిందువుల తర్వాత స్థానంలో ఉన్నా, అనేక కారణాల వల్ల ముస్లింలను మైనారిటీలని, వారు రాసే సాహిత్యం మైనారిటీ సాహిత్యం అనీ పిలుస్తున్నారు. కానీ, తెలుగులో వస్తున్న ముస్లిం సాహిత్య పుస్తకాలపై ఎక్కడా తమ సాహిత్యం ”మైనారిటీ సాహిత్యం” అని కనిపించట్లేదు. ఫోటోలో వరసగా డా//సీతారాం, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, మాట్లాడుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత ఉన్న ది స్కైబాబా. ‘మైనారిటీ’ అనే పదం ప్రధానంగా సంఖ్యావాచకాన్ని సూచిస్తుంది. దాన్ని మనం అల్ప సంఖ్యాక వర్గంగా భావిస్తున్నాం. 2005 సర్వే ప్రకారం ఎన్సిక్లోపిడియా బ్రిటానికా ప్రకారం ప్రపంచ జనాభాలో 33% క్రైస్తవులు, 20% ముస్లింలు, 13% హిందువులు, 5.9% బౌద్దులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 80.5% (82,75,78,868)హిందువులు, 13.4% (13,81,88,240) ముస్లింలు, 2.3% (2,40,80,016) క్రైస్తవులు, 1.9% (1,92,15,730) సిక్కులు, 0.8% (79,55,207) బౌద్దులు, 0.4% (42,25,053) జైనులు ఉన్నారు. అలాగే 0.6% (66,39,626) పర్షియన్లు మరియు ఇతర మతస్థులు ఉన్నారు. మత గుర్తింపు లేకుండగా 0.1% (7,27,588) ఉన్నారు. ఒక్క మన భారతదేశంలో ఉన్న సుమారు 102 కోట్ల జనాభాని ఆధారంగా తీసుకొని మాట్లాడినా, ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. సంఖ్యాపరంగా చూసినపుడు హిందువుల కంటే ముస్లింలు అల్ప సంఖ్యాక వర్గం అవుతారు. కాని, ముస్లింల కంటే అల్ప సంఖ్యాక వర్గంగా క్రైస్తవులు, బౌద్దవులు, తదితర మత వర్గానికి చెందిన వారు అవుతారు. కనుక, మరి ముస్లింలను మాత్రమే మైనారిటీ వర్గం అని ఎందుకు పిలవాలి? అనేది ఒక ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా చూసినా, క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలు ప్రకారం మాత్రమే. ఇంకా అనేక మంది ఉండవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఒకటి ఉంది. భారతదేశంలో ముస్లింలను మైనారిటీ వర్గం అని పిలవడం సమంజసమేనా? అలా పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? 1) ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళే కీలక వ్యక్తులుగా ఫోకస్ కావడం జరుగుతుంది. 2) ముస్లిం మతంలో అల్లా బోధనల్లో ఉన్నవి ఏమైనా గానీ, ‘జీహాద్‌’ పట్ల ముస్లిమేతర సమాజానికి వాస్తవ విషయాలు తెలుస్తున్నాయో లేదో తెలియదు. కానీ, జీహాద్‌ అనగానే ‘ఒక మత యుద్ధం’ అనే ప్రచారంలో ఉంది. తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే యుద్ధం అని కూడా ప్రచారంలో ఉంది. ఇలాంటి కారణాల వల్ల ముస్లింల పట్ల ప్రపంచ వ్యాప్తంగా, ఒక ద్వేష పూరిత వాతావరణం ఏర్పడిందనిపిస్తుంది. ప్రపంచంలోఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా, ఆ ఉగ్రవాదుల్లో ముస్లిం పేర్లు కనిపించినా, దాని ప్రభావం వల్ల కూడా అందరి ముస్లింలపై ఆ అనుమానపు చూపులు చూస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తుంది. భారతదేశంలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, వారి కంటే తర్వాత స్థానంలో ఉన్న వారికున్నంత స్వేచ్ఛ ముస్లింలకు లేదనే అభిప్రాయం బలంగానే వినిపిస్తుంది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాలు జమ్మూ & కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తదితరాలను చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో జనాభాని పరిశీలించినా ప్రథమ స్థానంలో హిందువులే ఉన్నారు. ముస్లింలకు రెండవ స్థానమే. జమ్మూ & కాశ్మీర్‌లో మాత్రం ప్రథమ స్థానంలో ముస్లింలు 67,93,240 రెండవస్థానంలో హిందువులు 30,05,349 ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో హిందువులు 13,39,79,263 మంది, ముస్లింలు 3,07,40,150 మంది ఉన్నారు. మహారాష్ట్రలో హిందువులు 77859385 మంది ముస్లింలు 1,02,70,485 మంది ఉన్నారు. ఢిల్లిలో హిందువులు 1,13,58,049 మంది ముస్లింలు 16,23,520 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందువులు 6,78,36,688 మంది ముస్లింలు 69,86,856 మంది ఉన్నారు. ఈ లెక్కలను చూసినపుడు జమ్మూ & కాశ్మీర్‌లో తప్ప మిగతా అన్నీ చోట్లా ఇంచుమించు హిందువులే అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. జమ్మూ & కాశ్మీర్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఈ నేపథ్యంతో చూసినపుడు ముస్లింలు నిజంగా అల్ప సంఖ్యక వర్గానికి చెందినవారే అవుతారా? అనేది ఒక బలమైన ప్రశ్న. నిజమే భారతదేశంలో హిందువులు తర్వాత ముస్లింలే అధిక సంఖ్యాకులు. కాని, 1992 డిశంబరు 6వ తేదిన బాబ్రి మసీద్ కూల్చివేత తర్వాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ తామంతా అల్ప సంఖ్యాక వర్గమనే భావం మరింత బలపడింది. ఆ తరవాత 2002లో గుజరాత్‌లో జరిగిన మత కల్లోలాలు ముస్లింలలో మరింత అభద్రతా భావాన్ని పెంచాయి. మరొక వైపు భారత స్వాతంత్రానికి ముందు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన నిజామ్‌ నవాబుల పాలన, ఆ కాలంలో నవాబుల చర్యల పట్ల ప్రచారంలో ఉన్న అభిప్రాయాలు నేటి ముస్లింల పట్ల ద్వేష పూరిత భావాన్ని కలిగిస్తున్నాయనీ ముస్లిం రచయితల రచనల బట్టి తెలుస్తుంది. ఈ అభిప్రాయాలన్నింటినీ, ఈ చారిత్రక నేపథ్యాన్ని చూసినపుడు ముస్లింలు దేశ వ్యాప్తంగా ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అభద్రతకు గురవుతున్నారనేది వాస్తవం. దీని కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 1.ఈ దేశంలో పుట్టి పెరిగినప్పటికీ ముస్లింలను చాలా మంది పరదేశీయులుగా భావించటం. 2. ముస్లింల పాలనలో హిందువులపై జరిగిన దాడులకు ముస్లింలను అందరినీ భాధ్యులుగా భావించటం. అవే అనుమానాలతో, అవే వాదనలతో అక్కడక్కడ మాట్లాడటం.3. సినిమాలలో ముస్లింలను దేశ ద్రోహులుగా చిత్రించటం.4) అన్ని వర్గాలతో జీవించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ముస్లిములను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారనే భావన. 5) మరొక వైపు ముస్లింలలో కూడా వర్గ, కుల భేదాలు ఏర్పడటం వల్ల ముస్లింలలోనే అంతర్గతంగా వివక్షతకు గురికావటం జరుగుతుందనే అనుభవ సత్యాలతో సాహిత్యాన్నీ సృష్టించటం. 6) అనేక సంవత్సరాలుగా భారతదేశంలోనే పుట్టి, పెరిగి అన్ని మతస్థులతో కలిసి మెలిసి జీవించటం వలన ముస్లిం సంస్కృతిలో వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా పీర్ల పండుగా, మోహరం, దర్గ పండుగలు అన్నీ ముస్లిం, హిందూ సమైఖ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నా, ఆచార సంప్రదాయాల వలన కొంతమంది ముస్లింలను ముస్లింలే తక్కువగా చూస్తున్నారనే భావన వ్యక్తమవుతుంది. 7) అరబ్బీ, ఉర్ధూ, పారశిక మొదలైన భాషలను అన్ని ముస్లిం వర్గాలు మాట్లాడ లేకపోవడం వల్ల భాషాపరమైన మైనారిటీని కూడా కొంత మంది ముస్లింలు అనుభవిస్తున్నారు.8) వివిధ పాలన కారణాల వల్ల జరిగిన మత మార్పిడిలలో దళిత వర్గాలు ముస్లింలుగా మారటంతో ముస్లింలలో కూడా స్థాయి భేదాలు పెరిగిపోయాయి. దీని వల్ల కూడా ముస్లింలలోనే మరో అల్ప సంఖ్యాక వర్గం ఏర్పడింది. ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నా ముస్లింల మనోభావాలను సాహితీకరించటంలో ప్రధానంగా మూడు ధోరణులు కనిపిస్తున్నాయి. అ) ముస్లిమేతరులు ముస్లింల గురించి రాయడం. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ముస్లింల గురించి ముస్లిమేతరులు తమ దృక్కోణంతో తమకు తెలిసిన జీవితాన్ని మాత్రమే రాయడం. మరో కోణంలో ముస్లింల పట్ల విష పూరిత భావాల్ని పెంచటం. ఆ) ముస్లింలే తమ మనోభావాలని వ్యక్తీకరించటం. ఇ) మత, కుల, వర్గ పరంగా జరుగుతున్న అన్ని వివక్షలను ప్రశ్నిస్తూ కొంత మంది ముస్లింలే రాయడం. ఆధునిక సాహిత్యంలో వచ్చిన వివిధ ధోరణి/ వాదన/ ఉద్యమాలలో స్త్రీ, దళిత, ముస్లిం మైనారిటి సాహిత్యం అనే విభజన ఇంచుమించు సాహితీవేత్తలందరూ అంగీకరించారు. జల్‌జలా, ఆజా, గుజరాత్ గాయం, అలావా, జగన్ కీరాత్, నఖాబ్‌, ముల్కీ, వతన్‌ తదితర ముస్లిం సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి. అంతక ముందు ‘చిక్కనవుతున్న పాట’, ‘పదునెక్కిన పాట’, ‘బహువచనం’ తదితర కవితా సంకలనాలలో కూడా ముస్లిం వేదనను తెలిపే రచనలు ఉన్నాయి. నిజానికి ముస్లిం సాహిత్యం, ఆ వాదనలను కేవలం హైదరాబాదు కేంద్రంగానే కాకుండా,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి భావాల్ని సమీకరించే దిశగా జరగాలనే వారూ ఉన్నారు. వీరి రచనలపై అనేక విశ్వ విద్యాలయాలు పరిశోధనలు చేస్తున్నాయి. ముస్లిమేతర సాహిత్య విమర్శకులు కూడా ఈ సాహిత్యాన్ని గుర్తించారు. ఇప్పుడు చెప్పుకున్న ముస్లిం రచయితల రచనలలో కూడా తమ వాదాన్ని బలమైన స్వరంతోనే చెప్పుకున్నారు. ముస్లిం సాహిత్యంలో కూడా ముస్లిం స్త్రీవాద సాహిత్యం అనే విభాగాన్ని కూడా సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు. అయితే, ఆయా పుస్తకాలలో గానీ, ఆ పుస్తకాలపైన గానీ ఎక్కడా కూడా తమది ”మైనారిటీ సాహిత్యమ”ని పేర్కొనలేదు. కానీ, అత్యధిక సంఖ్యాక వర్గం దగ్గర నివశించే అల్పసంఖ్యాక వర్గం పొందే అభద్రతా భావమే వారి రచనల నిండా ప్రతిఫలిస్తుంది. కనుక ”మైనారిటి” అనేది ఆ ప్రజల మానసిక భావన. దానిని అనుసరించి ”మైనారిటీ సాహిత్యం” అని అనగానే ముస్లింల అభద్రతను తెలిపే సాహిత్యంగా గుర్తిస్తున్నారు. వారు రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ఆ భావననే ప్రచారం చేస్తున్నాయి. ముస్లిం సాహిత్యంలో కూడా కొన్ని ఆంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ వారందరిలో కనిపించే మౌలిక భావన మాత్రం అభద్రతను ప్రతిఫలింజేయడం, తమని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం జరుతుతుందని, దానికోసం ప్రతిచోటా దేశభక్తిని నిరూపించుకోవలసి వస్తుందనీ వాదిస్తున్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, తదితర ముస్లిం దేశాలలో జరిగే మత, సామాజిక కార్యక్రమాలతో భారతీయ ముస్లింలు కూడా ఒకే గాటినికి కట్టేసి చూడటం జరుతుందనీ, కానీ తాము ముందు భారతీయులమని గుర్తించాలని వాదిస్తున్నారు. ఇలా అనేక కారణాల వల్ల వీరి సాహిత్యమే ” మైనారిటీ సాహిత్యం” గా మన తెలుగులో చాలా మంది పరిగణిస్తున్నారు. భారత దేశంలో మతపరంగా జరిగినట్లే కుల, ప్రాంత, లింగ వివక్ష కూడా కొనసాగుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారిలోనే అనేక ఉపకులాలు, అలాగే బి.సి. లలోని అనేక ఉపకులాలు ఉన్నాయి. వీరికి ఎవరి అస్తిత్వం వారికి ఉంది. వీళ్ళందరికీ రాజ్యంగం ప్రకారం లభించవలసిన హక్కులు సమానంగా లభించటం లేదు. కొన్ని ఉప కులాల వారికి అన్యాయం జరుగుతుంది. ప్రాంతాల వారిగా చూసినప్పుడు కూడా ఈ వివక్ష కనబడుతుంది. కనుక నిర్ధిష్ట ఉపకుల సాహిత్యంలో అల్ప సంఖ్యాక వర్గ తత్వమే కనిపిస్తుంది. మన భారతదేశంలో దళితులంతా అనేక పేర్లతో ఉన్నారు. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వారి కుల నామాలు భిన్నంగా ఉన్నాయి. దానిని బట్టి వారి వృత్తి, సాంఘిక హోదా, దానిని అనుసరించి వారి ఆర్ధిక పరిస్థితి నిర్ణయించబడుతుంది. భారతదేశంలో సుమారు అర్థ శతాబ్ధం క్రితం జరిగిన సర్వేలను అనుసరించి ఏర్పడిన కుల జాబితాలేనేటికీ కొనసాగుతున్నాయి. వాటిని అనుసరించి రూపొందినవే చట్టాలుగా అమలులోకి వచ్చాయి. వాటి వల్ల సమైఖ్యత పేరుతో ఉన్న షెడ్యూలు వల్ల కొన్ని కులాలు, ఉపకులాలు దోపిడీకి గురవుతున్నాయి. వాటిని గుర్తించిన మేథావులు సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నా, అభివృద్ధి నిరోధక శక్తులు వాటిని తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ ఉద్యమం అలాంటిదే. కనుక మైనారిటీ అనేది కులాలు, ఉపకులాలను బట్టి కూడా ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్నా, వారు భారతదేశంలో అల్ప సంఖ్యాకులే. వాళ్ళు కేవలం రెండు శాతం కూడా లేరు. 19వ శతాబ్డం వరకూ ముస్లిం, హిందూ పాలన ప్రభావం వల్ల క్రైస్తవుల ప్రభావమే లేదు. హిందూ ఆధిపత్యమే కొనసాగింది. తర్వాతకాలంలో బౌద్ద, జైన మత ప్రభావాలు ఉన్నా, ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత, ప్రభావం చాలా వేగవంతంగానే కనిపించింది. మూడో మతంగా క్రైస్తవ మతం తన స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్రిటీష్ పాలనా ప్రభావంతో క్రైస్తవ మతం వేగంగానే విస్తరించింది. అలా విస్తరించడానికి పాలనా ప్రభావం ఉన్నా, క్రైస్తవంలో కనిపించే ప్రేమ తత్త్వం కింది వర్ణాల్ని విశేషంగా ఆకర్షించింది. దీనికి తోడు ఆర్థికంగా కూడా సహకారి అయ్యింది. హిందూ మతంలో చూపే కుల వివక్ష మొదట్లో క్రైస్తవంలో కనిపించక పోవడంతో సామాజికంగా కింది వర్ణాల వాళ్ళు క్రైస్తవంలోకి మారిపోవడంతో హిందూ మతంలో సంస్కరణోద్యమాలు వేగవంతమయ్యాయి. ఆ సంస్కరణ ప్రధానంగా హిందూ మతాన్ని పునర్జీవింప చేసే దిశగానే జరిగాయి. కానీ, దాన్ని సాంస్కృతిక పునర్జీవనమన్నారు. మరోవైపు బ్రిటిష్ పాలన అన్ని రంగాలలోనూ ఆధిపత్యాన్ని చెలాయించడాని తద్వారా భారతీయ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పుల పట్ల మేథావులలో ఆలోచన ప్రారంభమైంది. అదే ధోరణి కొనసాగితే దేశ సార్వభౌమత్వం ప్రశార్ధమై పోతుందని ఊహించారు. వ్యాపారం కోసం వచ్చినా, తర్వాత కాలంలో అన్ని రంగాల్ని శాసించే స్థాయికి చేరుకోవడంతో సాంస్కృతిక పునర్జీవన కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యాయి. మరోవైపు భారతీయుల స్వయం పాలన కోసం జరుగుతున్న స్వాతంత్ర్యోధ్యమంతో వేగవంతమైంది. దీనిలో భాగంగానే సంస్కరణోద్యమం రావడం, దానిలో భాగంగా ‘హరిజనుల’ పట్ల గాంధీజీ ప్రణాళిక బయటకొచ్చింది. హరిజననోద్యమం దళితుల్ని ఆలోచింపజేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేసింది. హరిజనోద్యమం దళితులకు విముక్తి కలిగించిందని, బ్రిటిష్ పాలకుల దగ్గరే దళితులకు కొన్ని ప్రత్యేక హక్కుల్ని పొందే ప్రయత్నం మరోవైపు అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగింది. స్వాతంత్ర్యానంతరం దళితులకు ఏవో కొన్ని రిజర్వేషన్లు తప్ప, కుల నిర్మూలన జరగక పోగా, దళితులపై మరింత ద్వేష భావం పెరిగిపోయింది. మరోవైపు దళితుల్లోనూ కొన్ని వర్గాల వాళ్ళే రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కుల్ని పొందడంతో, మరికొన్ని దళిత వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దాని కోసం దళితుల సమైక్యత అనేది అన్ని రకాలుగా పంపిణీ జరిగినప్పడే జరుగుతుందని భావించే స్థితికి చేరుకుంది. దాన్ని కొన్ని దళిత వర్గాలు అంగీకరించక పోవడంతో వర్గీకరణ ఉద్యమాలు రాక తప్పలేదు. అలా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్గీకరణ ఉద్యమం తీవ్రమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి కూడా వర్గీకరణలో గల సామంజస్యాన్ని అంగీకరించింది. దీనితో దళితుల్లోని ప్రధాన వర్గాలైన ‘మాల – మాదిగ’ లలో మాదిగలు ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. కానీ, మాదిగ సాహిత్యాన్ని ఒక ప్రత్యేక సాహిత్య ధోరణిగా దళిత సాహితీ వేత్తలు కూడా అంగీకరించడం లేదు. తమ ఆవేదనల్ని వ్యక్తం చేస్తున్నా మాదిగ సాహిత్యం ఇప్పుడు మైనారిటీ సాహిత్యమైంది. అలాగే, దేశంలో జరుగుతున్న క్రైస్తవులపై, క్రైస్తవుల జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ రాస్తున్న సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యమే అవుతుంది. అలాగే తెలంగాణపై జరుగుతున్న వివక్షను తెలిపే సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యమే అవుతుంది. ( 10-12-2008 న రాజమండ్రిలో కేంద్ర సాహిత్య అకాడమీ, నన్నయ విశ్వవిద్యాలయం, మనోఙ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించిన ” మైనారిటీ సాహిత్యం చర్చలు ” సదస్సులో చేసిన నేను చేసిన అధ్యక్ష ఉపన్యాసాన్ని కొన్ని మార్పులు చేర్పులతో ఇక్కడ అందిస్తున్నాను. )

March 18, 2009 at 3:31 pm Leave a comment

Older Posts


Categories

  • Blogroll

  • Feeds


    Follow

    Get every new post delivered to your Inbox.